జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం: ముద్దరబోయిన
ABN, First Publish Date - 2021-10-15T06:55:54+05:30
జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం: ముద్దరబోయిన
చాట్రాయి, అక్టోబరు 14: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశం అవుతోందని, ప్రజలు మేల్కోకపోతే భావితరాలకు మనుగడ ఉండదని టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు. మండలంలోని పోలవరంలో చల్లగుళ్ల కృష్ణయ్య మామిడి తోటలో గురువారం టీడీపీ మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కినేని చందు, బసవారెడ్డి, మోరంపూడి శ్రీనివాసరావు, చిట్టిబాబు, రామచంద్రరావు, అత్తులూరి శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-15T06:55:54+05:30 IST