ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ భూ కుంభకోణంపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి: MP raghurama

ABN, First Publish Date - 2021-07-22T16:47:17+05:30

విశాఖ భూ కుంభకోణంపై ఏపీ సీఎం జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. విశాఖ భూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విశాఖ భూ కుంభకోణంపై ఏపీ సీఎం జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ నివేదిక సమర్పించిందని... సిట్‌ నివేదికలోని నిందితులపై ఇప్పటికి చర్యలు తీసుకోలేదని అన్నారు. సిట్ నివేదికలో పేర్లు ఉన్నవారితో...మన నేతలు సెటిల్‌మెంట్లు చేసుకున్నారని ఆరోపణలున్నాయని తెలిపారు. వివాదాస్పద భూముల్లో మననేతలు పెద్దవాటా డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నట్లు చెప్పారు. విజయసాయిరెడ్డికి చెందిన ప్రగతి భారతీ ట్రస్టు లావాదేవీలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ భూ కుంభకోణంపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలన్నారు. నిందితులకు శిక్షలు పడేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-22T16:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising