ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలి: ఎంపీ కేశినేని నాని

ABN, First Publish Date - 2021-02-25T17:05:52+05:30

వైసీపీ నేతలు అమ్మవారి సంపదను దోచుకుంటున్నారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. గురువారం పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ నేతలు అమ్మవారి సంపదను దోచుకుంటున్నారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. గురువారం పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఏసీబీ విచారణ చేస్తేనే వందల కోట్ల అవినీతి జరిగిందని తేలిందని... మంత్రి వెల్లంపల్లి, ఆలయ ఈవోకు తెలియకుండా ఇంత దోపిడీ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని‌వందల కోట్లు మంత్రిగా ఉండి సంపాదించారని విమర్శించారు. ఏపీలో అన్ని ఆలయాల్లో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని పట్టుబట్టారు. అభివృద్ధి పనులు పట్టనివారు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉండటం మన దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. చిన్న రోడ్డు  పనులు కూడా చేయలేని స్థితిలో ఉన్నారన్నారు. ఆస్తి, డ్రెయినేజీ, నీటి పన్నులు భారీగా పెంచుతున్నారని మండిపడ్డారు. టీడీపీ వల్లే అభివృద్ధి సాధ్యమని.. తమకు అవకాశం ఇస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి చేస్తానని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-02-25T17:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising