ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి? : ఎంపీ బాలశౌరి

ABN, First Publish Date - 2021-08-03T07:11:57+05:30

: జాతీయ విద్యా విధానం కింద నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ఏమి చర్యలు తీసుకుంటోందని పార్లమెంటు సమావేశాల్లో బందరు ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 2 : జాతీయ విద్యా విధానం కింద నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ఏమి చర్యలు తీసుకుంటోందని పార్లమెంటు సమావేశాల్లో బందరు ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సాయం చేసే ఆలోచన ఏమైనా ఉందని ప్రశ్నించారు. దేశంలోని 15 వేల పాఠశాలల పునరుద్ధరణకు ఆర్థిక మంత్రి హామీ ఇచ్చిన మేరకు తీసుకుంటున్న చర్యల ఏమిటని ఆయన  కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను  ప్రశ్నించారు. విద్యార్ధులకు ఉచిత విద్య అందించేందుకు, నిర్బంధ ప్రాథమిక విద్య అమలు చేసేందుకు ఏఏ చర్యలు తీసుకుంటున్నారన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ,  అన్ని ప్రభుత్వ పాఠశాలలకు దాదాపు రూ.లక్ష చొప్పున నిధులు మంజూరు చేశామని, దీనిలో పది శాతం నిధులు పారిశుధ్య చర్యల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల అభివృద్ధికి నాడు - నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలను ఎంపీ బాలశౌరి వివరించారు. 

Updated Date - 2021-08-03T07:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising