సీఎం జగన్కు కృతజ్ఞతలు: తోట త్రిమూర్తులు
ABN, First Publish Date - 2021-06-21T18:55:34+05:30
ఏపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్కు తోట త్రిమూర్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.
అమరావతి: ఏపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్కు తోట త్రిమూర్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం ఉదయం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన నలుగురు వైసీపీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తోటత్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ తన 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో మొదటి సారి ఒక నాయకుడి ఆశీస్సులతో మండలి సభ్యుడిని అయినట్లుత తెలిపారు. గత ఎన్నికల్లో జగన్ ఛరిష్మా ముందు గెలవలేక పోయానన్నారు. తమ సామాజిక వర్గానికి సహాయం చేయటానికి ముందు ఉంటానని స్పష్టం చేశారు.
మరో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ... కడప జిల్లా నుంచి మొదటి బీసీ ఎమ్మెల్సీగా జగన్ అవకాశం కల్పించారన్నారు. బీసీ అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.
Updated Date - 2021-06-21T18:55:34+05:30 IST