తాగునీటి సమస్య తలెత్తనీయకండి
ABN, First Publish Date - 2021-01-21T06:29:52+05:30
తాగునీటి సమస్య తలెత్తనీయకండి
విజయవాడ రూరల్, జనవరి 20 : ఈ ఏడాది వేసవిలో తాగునీటి సమ స్య లేకుండా చూడాల్సిన బాధ్యత అధి కారులపై ఉందని టీడీపీ గన్న వరం నియోజకవర్గం ఇన్చార్జి బచ్చుల అర్జునుడు సూచించారు. నున్నలో రక్షిత మంచినీటి పథకాలు లేకపోవడంతో ఇప్పటికే తాగునీటి సమస్య తలెత్తిందన్నారు. ఈ నేపథ్యంలో రానున్న వేసవిలో ప్రత్యేకంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని కోరారు. నున్నలో నెలకొన్న తాగునీటి సమస్య, రక్షిత మంచి నీటి పథకాల అమలు తీరును ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు బుధవారం పరిశీలిం చారు. అలాగే నున్న బైపాస్ రోడ్డును అసం పూర్తిగా వదిలేయడం వల్ల గ్రామంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని, దీనిపై శాస న మండలిలో ప్రస్తావిస్తానన్నారు.
Updated Date - 2021-01-21T06:29:52+05:30 IST