నేడు ఢిల్లీకి మంత్రి Mekapati
ABN, First Publish Date - 2021-11-11T13:57:06+05:30
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు, రేపు ఢిల్లీ పర్యటించనున్నారు.
అమరావతి: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు, రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో, మధ్యాహ్నం 3గంటలకు ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయాతో మంత్రి భేటీ కానున్నారు. ప్రపంచ ఆర్థిక సమాఖ్య అధ్యక్షుడిని కూడా మంత్రి మేకపాటి కలవనున్నారు. రాష్ట్రానికి రావలసిన నిధులు సహా ఆయా శాఖలకు చెందిన అంశాలపై కేంద్ర మంత్రులతో గౌతమ్ రెడ్డి చర్చించనున్నారు.
Updated Date - 2021-11-11T13:57:06+05:30 IST