Pawanపై మంత్రి కొడాలి నాని ఫైర్
ABN, First Publish Date - 2021-11-02T18:34:36+05:30
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పవన్ కళ్యాణ్, వైఎస్సార్ పార్టీకి వారం రోజులు గడువు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు.
గుడివాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పవన్ కళ్యాణ్, వైఎస్సార్ పార్టీకి వారం రోజులు గడువు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. చచ్చిపోయిన పార్టీల నాయకులైన పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు భయపడే వారు ఎవరు లేరని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్కు దమ్ముంటే, ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి డెడ్ లైన్ పెట్టాలని అన్నారు. ప్రధాని మోదీకి డెడ్లైన్ పెట్టి, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా పవన్ కళ్యాణ్ సాధిస్తే మంచిది అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.
Updated Date - 2021-11-02T18:34:36+05:30 IST