ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గేటు గడ్డర్‌ విరిగిపోవటం వల్లే..

ABN, First Publish Date - 2021-08-06T06:29:08+05:30

గేటు గడ్డర్‌ విరిగిపోవటం వల్లే..

అధికారులతో మాట్లాడుతున్న మంత్రి అనిల్‌కుమార్‌, ఉదయభాను
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులిచింత లను సందర్శించిన మంత్రులు

జగ్గయ్యపేట రూరల్‌, ఆగస్టు 5 : పులిచింతల ప్రాజెక్టు గేటు ఎత్తే సమయంలో గడ్డర్‌ విరిగి పడిపోవటం వల్లే ప్రమాదం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ వివరణ ఇచ్చారు. పులిచింతల ప్రాజెక్టును గురువారం ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను, కలెక్టర్‌ నివాస్‌, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ గేటుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇందుకు అన్ని గేట్లూ తెరిచి నీటిని దిగువకు విడుదల చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని సాంకేతిక నిపుణులను ఆదేశించామని తెలిపారు. కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ పులిచింతల నుంచి నీటిని విడుదల చేయటం వల్ల ఏర్పడే ముంపు నుంచి ప్రజలను కాపాడేందుకు పునరావాస చర్యలు చేపట్టామని చెప్పారు. ఆ తర్వాత మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు.  


Updated Date - 2021-08-06T06:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising