మండల తెలుగు యువత అధ్యక్షుడు వేణుగోపాలరావు మృతి
ABN, First Publish Date - 2021-01-25T06:51:59+05:30
మండల తెలుగు యువత అధ్యక్షుడు వేణుగోపాలరావు మృతి
కలిదిండి, జనవరి 24 : కోరుకొల్లుకు చెందిన మండల తెలుగు యువత అధ్యక్షుడు కొమ్మారెడ్డి వేణుగోపాలరావు(38)అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకట రమణ, టీడీపీ మండల అధ్య క్షుడు జోగిరాజు, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ వల్లభ నేని శ్రీనివాస్ చౌదరి, నున్న భగవాన్లు, వలవల రమేష్, కేశిరెడ్డి బలరామ్, చెన్నంశెట్టి మురళీకృష్ణ, వలవల రామారావు, నున్న సుబ్రహ్మణ్యం, వేంపాటి ప్రవీణ్ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Updated Date - 2021-01-25T06:51:59+05:30 IST