రూ.2.50 లక్షల తెలంగాణ మద్యం స్వాధీనం
ABN, First Publish Date - 2021-04-13T06:13:08+05:30
రూ.2.50 లక్షల తెలంగాణ మద్యం స్వాధీనం
జగ్గయ్యపేట రూరల్, ఏప్రిల్ 12: అనుమంచిపల్లి వద్ద తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న సిమెంట్ లారీతో పాటు రూ. 2.50 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఆరుగురిపై కేసు నమోదు చేశామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సోమవారం చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం రాత్రి తెలంగాణ నుంచి 1,816 మద్యం సీసాలతో సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన లారీ డ్రైవర్ పాకనాటి పవన్ మద్యం తీసుకువస్తూ పట్టుబడ్డాడన్నారు. విచారణ చేయగా జగ్గయ్యపేట మండల బండిపాలెం గ్రామానికి చెందిన లారీ యజమాని మైలా వెంకటేశ్వర్లు అతని కుమారుడు అనిల్ కుమార్, వత్సవాయి మండలం గట్టు భీమవరం గ్రామానికి చెందిన చిన్ని స్వామి కలిసి తెలంగాణ నుంచి మద్యం తెచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిసిందన్నారు. మద్యం కొనుగోలుకు సహకరించిన కోదాడ మండలం అశోక్నగర్కు చెందిన బత్తుల కోటేశ్వరరావు, మునగాలకు చెందిన మామిడి యాదగిరిలతో కలిపి ఆరుగురిపై కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఎస్సై వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-13T06:13:08+05:30 IST