ఆచరణ సాధ్యంకాని మూడు రాజధానుల కోసం సమయం వృధా చేస్తున్నారు: లంకా దినకర్
ABN, First Publish Date - 2021-11-12T18:00:03+05:30
జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అమరావతి: జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో చేతనైతే గతి శక్తి యోజనలో రాష్ట్రానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు పెట్టాలని సూచించారు. ఆచరణ సాధ్యం కాని మూడు రాజధానుల కోసం సమయం వృధా చేస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని, దీనికి నిధులు అడగడం కోర్టు ధిక్కారం అవుతుందన్నారు.
అమరావతి రైతుల మహా పాదయాత్ర విజయవంతంగా దూసుకుపోతుంటే తట్టుకోలేక సీఎం జగన్ మూడు రాజధానుల నిధుల అంశం వెలుగులోకి తెస్తున్నారని లంకా దినకర్ విమర్శించారు. గతి శక్తి యోజన కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎలా సమకూర్చుకుంటారో చెప్పి అవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం పొందాలని, ఇప్పటికే ఆలస్యం అయ్యిందని లంకా దినకర్ అన్నారు.
Updated Date - 2021-11-12T18:00:03+05:30 IST