కర్నూలులో ఎస్సీ హాస్టల్ విద్యార్థుల ధర్నా
ABN, First Publish Date - 2021-10-05T13:17:13+05:30
జిల్లాలోని ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ధర్నాకు దిగారు.
కర్నూలు: జిల్లాలోని ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ధర్నాకు దిగారు. కొన్ని నెలలుగా అద్దె చెల్లించలేదని హాస్టల్ను యజమాని ఖాళీ చేయించడంతో విద్యార్థులు బయటకు వచ్చారు. రోడ్డు మీద బ్యాగులు, లాగేజీతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వార్డెన్ భాస్కర్ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2021-10-05T13:17:13+05:30 IST