ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ సభ్యులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు: కొనకళ్ల

ABN, First Publish Date - 2021-11-20T18:43:58+05:30

గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గుడ్లవల్లేరు మండలంలో నిర్వహించిన భారీ ర్యాలీలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు,  టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఫోటోలను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ సభ్యుల అకృత్యాలు ప్రజలకు తెలియకుడదనే అసెంబ్లీ సమావేశాల ప్రసారాలు నిలిపి వేశారన్నారు. ప్రజలు చెప్పులతో కొట్టే స్థితికి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దిగజారారని కొనకళ్ల నారాయణరావు అన్నారు.

Updated Date - 2021-11-20T18:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising