బోర్డర్ వద్ద పటిష్ట బందోబస్తు
ABN, First Publish Date - 2021-05-06T05:38:11+05:30
బోర్డర్ వద్ద పటిష్ట బందోబస్తు
వత్సవాయి: అంతర్రాష్ట్ర సరిహద్దు వత్సవాయి-బోనకల్లు మద్య వత్సవాయి పోలీసులు బుధవారం పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సరిహద్దు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రించారు. సరుకు రవాణా వాహనాలు, అత్యవసర సేవల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. మండలంలో పాక్షిక లాక్డౌన్ విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా మధ్యాహ్నం 12 గంటలకు దుకాణాలను మూసి ఇళ్లకు వెళ్లిపోయారు.
Updated Date - 2021-05-06T05:38:11+05:30 IST