ఇద్దరు మృతి.. 66 మందికి కరోనా
ABN, First Publish Date - 2021-10-17T06:03:49+05:30
ఇద్దరు మృతి.. 66 మందికి కరోనా
విజయవాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం మరో ఇద్దరు కరోనా బాధితులు మరణించారు. గడచిన 24 గంటల్లో 66 మందికి వైరస్ సోకింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,18,441కి, మొత్తం కరోనా మరణాలు అధికారికంగా 1,406కి పెరిగాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 1,16,277మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 758 మంది చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2021-10-17T06:03:49+05:30 IST