అర్హులకు కాపునేస్తం వర్తింపచేయాలని నిరసన
ABN, First Publish Date - 2021-07-24T06:20:11+05:30
అర్హులైన కాపులందరికీ కాపునేస్తం పథకం వర్తింపజేయాలని కోరుతూ అజిత్సింగ్నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో కాపు నేతలు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
అర్హులకు కాపునేస్తం వర్తింపచేయాలని నిరసన
అజిత్సింగ్నగర్, జూలై 23: అర్హులైన కాపులందరికీ కాపునేస్తం పథకం వర్తింపజేయాలని కోరుతూ అజిత్సింగ్నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో కాపు నేతలు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత వంగవీటి మోహనరంగా, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాలకు టీడీపీ ఫ్లోర్లీడర్ నెలిబండ్ల స్వామి, టీడీపీ మాజీ ఫ్లోర్లీడర్ ఎరుబోతు రమణారావు, రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకతీతంగా కాపులంతా ఐక్యమై పోరాడితే జగన్రెడ్డి ప్రభుత్వం దిగి వస్తుందని, పోరాటాలకు కాపులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జయరాజు, శ్రీను, మోహన్, సోమేశ్వరరావు, గరిమెళ్ల చిన్నా, దాసరి పెప్సీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-24T06:20:11+05:30 IST