నత్తనడకన ఇళ్ల స్థలాల జియో ట్యాగింగ్
ABN, First Publish Date - 2021-03-03T06:29:44+05:30
నత్తనడకన ఇళ్ల స్థలాల జియో ట్యాగింగ్
హనుమాన్జంక్షన్ రూరల్, మార్చి 2 : మండల వ్యాప్తంగా గ్రామాల్లో ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జియో ట్యాగింగ్ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. కొన్ని గ్రామాల్లో జియోట్యాగింగ్ పనులు జరుగుతుండగా, మరి కొన్ని గ్రామాలలో నత్తనడకన సాగుతోంది. ఉదయం పనులు మానుకుని వచ్చిన మహిళలను ఎండలో నుంచో బెట్టారని, 150 మందిని రమ్మని 22 మందికి మాత్రమే జియో ట్యాగింగ్ చేశారని వీరవలి లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులు ఆందోళన చెందనవసరం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జియోట్యాగింగ్ ప్రక్రి య మొదలవడంతో సాంకేతిక లోపం తలెత్తిందని, బుధవారం నుంచి అన్ని గ్రామాల్లో మొదలవుతుందని డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ వివరించారు.
Updated Date - 2021-03-03T06:29:44+05:30 IST