ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వ తీరుపై జనసేన నిరసన.. అడ్డంకులు..అరెస్టులు
ABN, First Publish Date - 2021-11-11T21:01:56+05:30
ఏపీ ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ విపక్షాలు, విద్యార్థి సంఘాల...
విజయవాడ: ఏపీ ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ విపక్షాలు, విద్యార్థి సంఘాల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనాన్ని నిరసిస్తూ విజయవాడ ఎస్కేపీవీ హిందూస్కూల్ ముందు జనసేన ధర్నాకు దిగింది. పోతిన మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎయిడెడ్ పాఠశాలలను కొనసాగించాలని జనసేన డిమాండ్ చేసింది. ఈ ఆందోళనను పోలీసులు అడ్డుకుని కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Updated Date - 2021-11-11T21:01:56+05:30 IST