ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ నేత ఇంటిని కూల్చివేసేందుకు యత్నం

ABN, First Publish Date - 2021-01-25T18:16:53+05:30

మేడ్చల్ జిల్లా: యాప్రాల్‌లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ నివాసం ఉండే టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్ జిల్లా: యాప్రాల్‌లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ నివాసం ఉండే టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మధుసూదన్ రెడ్డికి చెందిన ఇంటిని అక్రమ నిర్మాణం పేరుతో అధికారులు కూల్చివేయడానికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు బందోబస్తు మధ్య ఆయన నివాసం కూల్చివేతకు సోమవారం ఉదయం నుంచి హడావుడి కొనసాగుతోంది. యాప్రాల్‌లో అన్ని ఇళ్ల నిర్మాణాలు ఉన్నా.. తన ఇంటినే ఎందుకు టార్గెట్ చేశారని మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనకు మద్దతుగా ఘటనా స్థలికి వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగిన నేరేడ్‌మెట్ కార్పొరేటర్ శ్రీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచనలమేరకే తన ఇంటిని కూల్చివేసేందుకు అధికారులు వచ్చారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. తాను ఎమ్మెల్యే మాట విననందుకు కక్ష కట్టారని, పోలీసులతో హౌస్ అరెస్టు చేయించి మరీ ఇల్లు కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హనుమంతరావు నుంచి తనకు, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని మధుసూదన్ రెడ్డి కోరారు.

Updated Date - 2021-01-25T18:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising