మహాత్ముడి మూలవిరాట్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం
ABN, First Publish Date - 2021-10-17T05:39:25+05:30
స్థానిక పాలఫ్యాక్టరీ సమీపంలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాల ప్రాంగణంలో ఉన్న గాంధీ దేవాలయంలో గాంధీ మహాత్ముని మూలవిరాట్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం శుక్రవారం చేపట్టారు.
మహాత్ముడి మూలవిరాట్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం
చిట్టినగర్, అక్టోబరు 16 : స్థానిక పాలఫ్యాక్టరీ సమీపంలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాల ప్రాంగణంలో ఉన్న గాంధీ దేవాలయంలో గాంధీ మహాత్ముని మూలవిరాట్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంలో గాంధీ రుద్ర చండీ హోమం నిర్వహించారు. శ్రీ చక్ర ప్రాణ ప్రతిష్ఠ, నిత్యపూజ మహోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ గాంధీ మూల విరాట్టును ప్రతిష్ఠంచడం జరిగిందని గాంధీ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు రాంపిళ్ల జయప్రకాష్ అన్నారు. గాంధీ ఆలయాన్ని సమగ్రమైన రీతిలో తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గాంధీ శతకం రచయిత ఉప్పులూరి లక్ష్మీనారాయణ, పి. పేరయ్య శాస్ర్తి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కమిటీ కోశాధికారి తమ్మిన యగ్నేశ్వరరావు, గుర్రం ఏడుకొండలు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-17T05:39:25+05:30 IST