మాజీ మంత్రి Paritala sunita సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2021-10-22T18:01:01+05:30
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు
అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంటసేపు కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మాలో ప్రవహించేది సీమ రక్తమే’’ అని అన్నారు. తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని... ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని అన్నారు. చంద్రబాబు తీరు మారాలని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని పరిటాల సునీత హెచ్చరించారు.
Updated Date - 2021-10-22T18:01:01+05:30 IST