ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ హయాంలోనే రజకుల సంక్షేమం

ABN, First Publish Date - 2021-12-06T06:00:55+05:30

టీడీపీ హయాంలోనే రజకుల సంక్షేమం

కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్న బొండా ఉమా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా

అజిత్‌సింగ్‌నగర్‌, డిసెంబరు 5: రజకులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సంక్షేమ ఫలాలను గత టీడీపీ ప్రభుత్వం అందించిందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. రజక అభ్యుదయ సంఘం, టైలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల ఆధ్వర్యాన అజిత్‌సింగ్‌నగర్‌లోని టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం పేదలకు ఉచితంగా బొండా ఉమా చేతుల మీదుగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామమని ఉమా అభినందించారు. టీడీపీ పాలనలో రజకులకు ఉచితంగా ఇస్త్రీ పెట్టెలను ఇచ్చామన్నారు. రాష్ట్రంలోనే ప్రథమంగా రజకుల కోసం సెంట్రల్‌ నియోజకవర్గంలో కల్యాణ మండపం నిర్మాణం చేపట్టామని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ భవనాన్ని సచివాలయంగా మార్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తిరిగి అధికారంలోకి రాగానే రజక కల్యాణ మండపాన్ని వినియోగంలోకి తెస్తామని, ప్రజలందరు చంద్రన్న నాయకత్వాన్ని బలపరచాలని ఉమా కోరారు. మధుసూదనరావు, నవనీతం సాంబశివరావు, రాజేంద్రప్రసాద్‌, సింహాచలం పాల్గొన్నారు.



Updated Date - 2021-12-06T06:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising