అధికార అహంతో భువనేశ్వరిని అవమానించారు
ABN, First Publish Date - 2021-11-25T06:37:42+05:30
అధికార అహంతో భువనేశ్వరిని అవమానించారు
మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం
విద్యాధరపురం, నవంబరు 24 : నిండు శాసనసభలో అధికార అహంకారంతో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమాన పరుస్తూ మాట్లాడారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గార్లపాటి విజయకుమార్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నాచౌక్లో నిరసన చేపట్టారు. బొండా ఉమా మాట్లాడుతూ ఆడపడుచులను గౌరవించలేని వైసీపీ ప్రభుత్వం భువనేశ్వరికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వివిధ జిల్లాలకు చెందిన ఆర్బీఎస్ నాయకులు గన్నవరపు శ్రీనివాస్, గూడూరు శేఖర్, సారథి, మంచికంటి ధనలక్ష్మి, జూపిటర్ ప్రసాద్, ఫణి, పెండ్యాల సీతారామ్, విజయలక్ష్మి, కల్పన, చెరువు సౌజన్య, రమేశ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
నేడు వర్ల రామయ్య నిరసన దీక్ష
భువనేశ్వరిపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పాలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గురువారం ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. విద్యాధరపురంలోని ఆయన స్వగృహంలో సతీమణితో కలిసి ఆయన దీక్ష చేస్తారు.
Updated Date - 2021-11-25T06:37:42+05:30 IST