ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి దృష్టి మరల్చేందుకే..

ABN, First Publish Date - 2021-10-21T06:49:02+05:30

గంజాయి దృష్టి మరల్చేందుకే..

పోలీసులను తప్పించుకుని వెళ్తున్న దేవినేని ఉమా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వంపై దేవినేని ఉమా ఫైర్‌

గొల్లపూడి/ జి.కొండూరు/రెడ్డిగూడెం, అక్టోబరు 20 : ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయనివ్వకుండా ముందస్తు అరెస్టులు చేయడం తీవ్రమైన చర్య అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో గొల్లపూడిలో బుధవారం భారీగా పోలీసులు మోహరించారు. వారి వలయాన్ని తప్పించుకునేందుకు దేవినేని ఉమా ఓ మోటార్‌ బైక్‌పై జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఆయన వచ్చి రావడంతోనే పోలీసులు చుట్టుముట్టి అమాంతం వ్యాన్‌లో ఎక్కించేశారు.  భవానీపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి సింగ్‌నగర్‌ స్టేషన్‌కు పంపారు.  ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ గంజాయి సాగు, హెరాయిన్‌ మత్తు నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చేందుకు మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబుకు నోటీసులు ఇచ్చి డ్రామాలాడారన్నారు. పట్టాభి ఇంటిపైన, పార్టీ కేంద్ర కార్యాలయంపైన దాడికి తెగబడటం దారుణమన్నారు. టీడీపీ గొల్లపూడి ప్రాంత అధ్యక్షుడు నర్రా వాసు, నాయకులు గూడపాటి పద్మశేఖర్‌, దారావతు శ్రీను నాయక్‌, షేక్‌ కరీముల్లా, ఆలూరి హరికృష్ణ, నూతులపాటి నారద, ఆలూరి సాంబశివరావు, అమరేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2021-10-21T06:49:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising