ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ భద్రత మధ్య కోర్టుకు దేవినేని ఉమ

ABN, First Publish Date - 2021-07-28T22:08:25+05:30

భారీ భద్రత మధ్య మాజీ మంత్రి దేవినేని ఉమను మైలవరం కోర్టుకు తరలించారు. ఉమను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఆయనను అన్యాయంగా అరెస్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: భారీ భద్రత మధ్య మాజీ మంత్రి దేవినేని ఉమను మైలవరం కోర్టుకు తరలించారు. ఉమను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. మైలవరం కోర్టు దగ్గరకు టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. మంగళవారం రాత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులను కూడా అరెస్ట్ చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. దేవినేని ఉమపై మొత్తంగా 12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి దేవినేనిపై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయన కారు కొంత దెబ్బతినగా... వెనుకే ఉన్న మరో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తిరిగి పోలీసులు దేవినేనిపైనే 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం గమనార్హం. 

Updated Date - 2021-07-28T22:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising