చర్యలు తీసుకునే ధైర్యముందా..
ABN, First Publish Date - 2021-08-19T06:00:48+05:30
చర్యలు తీసుకునే..
ట్విట్టర్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దేవినేని ఉమా
మైలవరం: ‘కొండపల్లి రిజర్వు ఫారెస్టును కొల్లగొట్టారు. పోలవరం కాలువ మట్టిని మింగేశారు. నైనవరం అడవులను దోచేస్తున్నారు. మైలవరం సహా రాష్ట్రంలో ఇసుక, మద్యంతో పాటు కాదేది మా దోపిడీకి అడ్డం అంటూ కొండలు, గుట్టలు, అడవులను కొల్లగొడుతున్న మీ ప్రజాప్రతినిధుల దోపిడీపై చర్యలు తీసుకునే ధైర్యముందా..’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బుధవారం సీఎం జగన్ను ట్విట్టర్లో ప్రశ్నించారు.
Updated Date - 2021-08-19T06:00:48+05:30 IST