వంతెన.. ప్రమాదం అంచున..
ABN, First Publish Date - 2021-06-12T05:47:18+05:30
వంతెన.. ప్రమాదం అంచున..
విజయవాడ, ఆంధ్రజ్యోతి : గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే జాతీయ రహదారిలో కృష్ణలంక వద్ద ఉన్న స్క్యూబ్రిడ్జి ఇది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరిగే ఈ వంతెన రెయిలింగ్ కూలిపోయి ప్రమాదకరంగా మారింది. కీలకమైన మలుపు కూడా కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి రెయిలింగ్కు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
Updated Date - 2021-06-12T05:47:18+05:30 IST