పన్నులు కట్టాలని ప్రజలపై ఒత్తిడి: Baburao
ABN, First Publish Date - 2021-11-15T18:18:21+05:30
రాష్ట్రంలో పట్టణ ప్రజలను ప్రభుత్వం పన్నులతో పిడిస్తోందని సీపీఎం నేత బాబూరావు అన్నారు.
విజయవాడ: రాష్ట్రంలో పట్టణ ప్రజలను ప్రభుత్వం పన్నులతో పిడిస్తోందని సీపీఎం నేత బాబూరావు అన్నారు. ఏపీ పట్టణ పౌర సమాఖ్య సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో బాబూరావు మాట్లాడుతూ ప్రజల అభ్యంతరాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పన్నులపై టాక్స్ ప్రేయర్స్ కోర్టును ఆశ్రయించారని... కోర్టులో ఉండగా పన్నులు కట్టాలని ప్రజలపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని మండిపడ్డారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పన్నులు వసూలు చేయడం అన్యాయమన్నారు. కోర్టులో పన్నుల వివాదం తేలేంత వరకు ప్రభుత్వం పన్నులు వసూలు చెయ్యకూడదని డిమాండ్ చేశారు. ఒక పక్క న్యాయ పోరాటం చేస్తూనే, మరో పక్క అన్ని సంఘాలతో కలిసి ఉద్యమం చేపడతామని బాబూరావు స్పష్టం చేశారు.
Updated Date - 2021-11-15T18:18:21+05:30 IST