ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులను ఆదుకోండి: సీపీఐ

ABN, First Publish Date - 2021-11-29T06:33:23+05:30

వరద బాధితులను ఆదుకోండి: సీపీఐ

విరాళాలు సేకరిస్తున్న దోనేపూడి శంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్‌టౌన్‌, నవంబరు 28: చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు, వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం 53వ డివిజన్‌లోని హనుమంతరాయమార్కెట్‌ వద్ద నుంచి వరద బాధితుల కోసం విరాళాల సేకరణను ప్రారంభించారు. అనేక మంది నివాసాలు, పంటలు, కొందరు ప్రాణాలు కోల్పోయారని, బాధితులను ఆదుకోవాలని ఆయన సూచించారు. డివిజన్‌ ఇన్‌చార్జి కార్యదర్శి కొట్టు రమణరావు, నాయకులు డీవీ రమణబాబు, తాతయ్య, రాయన గురునాఽథం, బైపిల్ల సత్యనారాయణ, బియ్యపు ఏడుచేపల కృష్ణారావు, చిన్న, మారుతి, కనకారావు, కొట్టు విజయలక్ష్మి విరాళాల సేకరణలో పాల్గొన్నారు. అనారోగ్యంతో కొంతకాలంగా నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్‌ నాయకుడు పల్లా సూర్యారావును సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ పరామర్శించారు. సూర్యారావు సతీమణి, పార్టీ నాయకురాలు దుర్గాంబ నుంచి వివరాలు సేకరించారు. 


Updated Date - 2021-11-29T06:33:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising