ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలి: Ramakrishna
ABN, First Publish Date - 2021-11-12T17:46:24+05:30
రాష్ట్రంలో ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.
అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టడానికి సంకోచాలు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులకు 7 డీఏలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామన్న మాట తప్పారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే పీఆర్సీ నివేదికను బయట పెట్టాలని రామకృష్ణ అన్నారు.
Updated Date - 2021-11-12T17:46:24+05:30 IST