ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటికైనా హోదాకై జగన్ నడుం కట్టాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-06-20T18:48:08+05:30

ఏపీకి ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ  డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి ప్రత్యేక హోదాపై వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన ఏడేళ్ల కాలంలో ఏపీకి అడుగడుగునా ద్రోహం చేస్తూనే ఉన్నారన్నారు. వైసీపీ, టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగి నరేంద్రమోదీ ఏపీకి చేసిన మోసం బట్టబయలవుతుందని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా సాధనకై ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నడుం కట్టాలని  రామకృష్ణ హితవుపలికారు.

Updated Date - 2021-06-20T18:48:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising