ఇద్దరు మృతి.. 76 కేసులు
ABN, First Publish Date - 2021-10-27T06:31:12+05:30
జిల్లాలో మరో ఇద్దరు కరోనా బాధితులు మంగళవారం మరణించారు.
విజయవాడ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మరో ఇద్దరు కరోనా బాధితులు మంగళవారం మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 76 మందికి వైరస్ సోకింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,19,070కి చేరుకున్నాయి. మరణాల సంఖ్య అధికారికంగా 1,425కి చేరింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 1,16,870 మంది కోలుకున్నారు. ఇంకా 775 మంది బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2021-10-27T06:31:12+05:30 IST