కోవిడ్ నిబంధనను ఉల్లంఘించిన సీఎం జగన్
ABN, First Publish Date - 2021-05-04T18:54:14+05:30
కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ... ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
అమరావతి: కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ... ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాస్క్ ధరించకుండా కోవిడ్ నిబంధనను ఉల్లంఘించారు. ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్లో సీఎం జగన్తో పాటు మంత్రులు విశ్వరూప్, పెద్దిరెడ్డిలు మాస్క్లు ధరించకుండా హాజరయ్యారు. మిగిలిన మంత్రులు అందరూ మాస్క్లతో కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. కాగా... కారులో కూర్చొని మాస్క్ ధరించకపోతే ఏపీ సర్కార్ రూ.100 ఫైన్ వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకంగా సీఎం జగన్ మాస్క్ లేకుండా సమావేశాలకు హాజరవుతుండడం పట్ల విపక్షాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
Updated Date - 2021-05-04T18:54:14+05:30 IST