చట్టాలపై అవగాహనతో సుపరిపాలన
ABN, First Publish Date - 2021-10-27T06:31:41+05:30
చట్టాలపై అవగాహనతో సుపరిపాలన
హనుమాన్జంక్షన్, అక్టోబరు 26 : పంచాయతీ వ్యవస్థపై అవగాహనతో ప్రజలకు సుపరిపాలన అందిస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని గ్రామ వార్డు సచివాలయ విభాగం జాయింట్ కమిషనర్ మొగిలి చందు సురేష్ అన్నారు. మంగళవారం బాపులపాడు మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యుల శిక్ష ణతరగతుల ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి పంచాయతీరాజ్ చట్టాలను వివరించారు. శిక్షణ పూర్తి చేసినవారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పీఎ్సఆర్ ప్రసాద్ మాట్లాడు తూ, మండలంలో 75శాతం మంది వార్డు సభ్యులు తరగతులకు హాజరైనట్లు చెప్పారు. మిగిలిన వారం దరికీ ఈ నెల 28, 29 తేదీల్లో తరగతులు నిర్వహిం చనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో- ఆర్డినేటర్ పద్మప్రియ, సూపరింటెండెంట్ మారుతీ రావు, ఈవోపీఆర్డీ కె.ప్రభాకరరావు, పంచాయతీ కార్యదర్శులు సీహెచ్ ఆంజనేయులు, మ స్తాన్రావు, ఏఎ్సఆర్ కోటేశ్వరరావు, కృష్ణ పరమాత్మ తదిత రులు తరగతులను నిర్వహించారు.
Updated Date - 2021-10-27T06:31:41+05:30 IST