ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం మాఫియా: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-10-25T20:39:18+05:30

ఏపీలో మద్యపాన నిషేధమని చెప్పి జగన్‌రెడ్డి సొంత వ్యాపారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏపీలో మద్యపాన నిషేధమని చెప్పి జగన్‌రెడ్డి సొంత వ్యాపారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపించారు. డ్రగ్స్‌తో యువత నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కంట్రోల్ చేయమని అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.


జగన్ గత రెండేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వైసీపీ శ్రేణులు హైకోర్టు జడ్జిలపై కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారన్నారు. చివరికి పార్లమెంట్ సభ్యుడిపై కూడా పోలీసులు చేయి చేసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-25T20:39:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising