ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా కేసులో విజయసాయిని విచారించాలి: బుద్దా వెంకన్న

ABN, First Publish Date - 2021-08-13T20:04:01+05:30

విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర బందిపోటు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర బందిపోటు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా విజయసాయి ఉత్తరాంధ్రను పీల్చి పిప్పు చేస్తున్నారని మండిపడ్డారు.  వైఎస్ వివేకా హత్య కేసులో ఏ-2ను సీబీఐ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఆయనను ప్రశ్నిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. 


వివేకానందరెడ్డి చనిపోయిన వార్త తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు విజయసాయి వెళ్లారని, గుండెపోటుతో మృతి చెందారని ఆయన ప్రకటించారని వెంకన్న అన్నారు. వివేకా ఒంటిపై కత్తిపోట్లు కనిపిస్తున్నా.. గుండెపోటుతో మరణించారని, తర్వాత హత్య అని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-13T20:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising