ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉయ్యాల చీర.. మెడకు బిగుసుకొని విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2021-03-06T06:36:15+05:30

ఉయ్యాలలో ఊగుతున్న బాలుడి మెడకు అదే చీర బిగుసుకొని ఊపిరాడక మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మైలవరం మండలం మొర్సుమిల్లిలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం రూరల్‌, మార్చి 5: ఉయ్యాలలో ఊగుతున్న బాలుడి మెడకు అదే చీర బిగుసుకొని ఊపిరాడక మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మైలవరం మండలం మొర్సుమిల్లిలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసుల కథనం.. మెర్సుమల్లికి చెందిన కాలేశ్వరరావుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దిరిశాల గుణదీప్‌ (11) మైలవరంలో ఓ ప్రయివేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం ఇంటి వద్ద ఉయ్యాల ఊగుతుండగా ఆ సమయంలో పక్కనే ఉన్న పశువుల దొడ్డిలో పాలు పితికేందుకు తల్లిదండ్రులు వెళ్లారు. ఈ క్రమంలో ఉయ్యాల చీర మెడకు బిగుసుకొని బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి తండ్రి కాలేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

Updated Date - 2021-03-06T06:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising