ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ గజినీలాగా మారిపోయాడు: నాగభూషణం

ABN, First Publish Date - 2021-06-11T18:10:24+05:30

గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పతనాన్ని కోరుతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పతనాన్ని కోరుతుందని  బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం అన్నారు. జగన్ గజినీలాగా మారిపోయాడని... జగన్ ఆనాడు రాజధాని గురించి ఏం మాట్లాడాడో వాళ్ల మంత్రులు మర్చిపోయారని విమర్శించారు. కరకట్ట వద్ద డ్రిడ్జింగ్ పనుల వలన రైతుల ఇబ్బందులు పడుతున్నారని... కట్టకి ఆనుకొని ఉన్న రైతుల పొలాల్లో మట్టి వేస్తే అధికారులకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. కరకట్ట బలహీన పడితే గ్రామాలు మునుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. డ్రిడ్జింగ్ విధానం సరికాదని...పొలాల రైతులకు కౌలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొలాల్లో డ్రిడ్జింగ్ లేకుండా చూడాలని..లేకుంటే బీజేపీ తరుపున ఆందోళన తీవ్రతరం చేస్తామని పాతూరి నాగభూషణం హెచ్చరించారు. శుక్రవారం కృష్ణానది ఒడ్డున డ్రిడ్జింగ్ చేసి ఇసుక తవ్వకాల పేరుతో కరకట్టను బలహీనపరుస్తున్నారంటూ కరకట్ట డ్రిడ్జింగ్  పనుల వద్ద బీజేపీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల పొలాల్లోకి మట్టి పోస్తున్నారంటూ బీజేపీ నేతలకు రైతులు మొర పెట్టుకున్నారు.

Updated Date - 2021-06-11T18:10:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising