ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతోంది: Kanna

ABN, First Publish Date - 2021-08-18T17:54:01+05:30

రాష్ట్రంలో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో సెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 50 ఏళ్లలో ఇలాంటి అవినీతి ఎక్కడా చూడలేదన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే పోలీస్ కేసులు పెట్టేస్తున్నారని మండపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండేదని...ఇప్పుడు సీఐడీ పటిష్టంగా ఉందని అన్నారు. రాష్ట్రానికి క్యాపిటల్ ఎక్కడ అని చెప్పుకోలేని స్ధితిలో ప్రభుత్వం ఉందన్నారు. పోలీస్ వ్యవస్థ ప్రతిపక్షాలను అణగదొక్కడానికే పని చేస్తోందని విమర్శించారు. 2008 లో వైఎస్సార్ తెచ్చిన ఆన్‌లైన్ జీవోల విధానాన్ని జగన్ నిలిపివేశారన్నారు. రహస్య పాలన నడపాలి అని ప్రభుత్వం భావిస్తుందని మండిపడ్డారు. ప్రజలకు డబ్బులు పంచుతున్నాం అనుకుంటే సరిపోదని...వాళ్ళు అన్ని అనుమనిస్తున్నారని తెలిపారు. నేతల హౌస్ అరెస్ట్‌లు పరిపాటిగా మారాయని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-08-18T17:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising