మహిళలకు కేన్సర్పై అవగాహనా కార్యక్రమం
ABN, First Publish Date - 2021-10-29T06:20:58+05:30
కుటుంబం మొత్తానికి కీలకమైన జీవన రేఖగా మహిళలు పోషించే పాత్ర ముఖ్యమైనదని ఎస్సీఆర్ డబ్ల్యూడబ్ల్యూఓ విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ జయ మోహన్ అన్నారు.
మహిళలకు కేన్సర్పై అవగాహనా కార్యక్రమం
పాయకాపురం, అక్టోబరు 28 : కుటుంబం మొత్తానికి కీలకమైన జీవన రేఖగా మహిళలు పోషించే పాత్ర ముఖ్యమైనదని ఎస్సీఆర్ డబ్ల్యూడబ్ల్యూఓ విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ జయ మోహన్ అన్నారు. దక్షిణ మఽధ్య రైల్వే మహిళా సంక్షేమ సంస్ధ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్లో గురువారం కేన్సర్పై మహిళలకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ రెండేళ్లుగా కొవిడ్ వల్ల మహిళలు రెగ్యులర్ స్ర్కీనింగ్, చెకప్ ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కేన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధులను నిర్లక్ష్యం చేశారని చెప్పారు. ఈ రెండేళ్లల్లో మహిళల్లో కేన్సర్ ప్రాభల్యం పెరిగిందన్నారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం సమయాన్ని వెచ్చించాలన్నారు. అనంతరం ఉపాధ్యక్షురాలు డి. శ్రీదేవి మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగులకు హెల్త్ కిట్లను పంపిణీ చేశారు.
Updated Date - 2021-10-29T06:20:58+05:30 IST