ఆశా వర్కర్ల ఆందోళన
ABN, First Publish Date - 2021-01-26T07:17:24+05:30
కరోనా వ్యాక్సిన్ వేయించుకుని అనారోగ్యంతో మృతి చెందిన ఆశా వర్కర్ విజయలక్ష్మి కుటుంబానికి రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాఽధ్యక్షుడు ఆర్.సి.పి.రెడ్డి డిమాండ్ చేశారు.
గుడివాడ రూరల్ : కరోనా వ్యాక్సిన్ వేయించుకుని అనారోగ్యంతో మృతి చెందిన ఆశా వర్కర్ విజయలక్ష్మి కుటుంబానికి రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాఽధ్యక్షుడు ఆర్.సి.పి.రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడలో ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి బీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు : ఆశా వర్కర్ విజయలక్ష్మి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం, కుటుం బంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు.
Updated Date - 2021-01-26T07:17:24+05:30 IST