పీఆర్సీ ఇచ్చే ఆలోచన ఉందా?: బొప్పరాజు
ABN, First Publish Date - 2021-11-11T21:50:58+05:30
అసలు పీఆర్సీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? ఆ ఆలోచన ప్రభుత్వానికి ఉంటే...
విజయవాడ: అసలు పీఆర్సీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? ఆ ఆలోచన ప్రభుత్వానికి ఉంటే నివేదిక కాపీ ఎందుకు ఇవ్వడంలేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు ప్రశ్నించారు. పీఆర్సీలో కొన్ని శాఖలకు అన్యాయం జరిగితే గతంలో మరో కమిటీ వేయించుకున్న చరిత్ర ఉందన్నారు. ప్రభుత్వంతో శుక్రవారం నాటి సమావేశంలో నివేదిక కాపీ కోసం పట్టుపడతామని చెప్పారు. ఆ తర్వాత ఏపీ జేఏసీతో కలిసి ఎగ్జిక్యూటీవ్ సమావేశాల ఏర్పాటుపై ఆలోచిస్తున్నామని బొప్పరాజు చెప్పారు. ఆ తర్వాత పీఆర్సీపై తమ నిర్ణయాన్ని చెబుతామన్నారు.
Updated Date - 2021-11-11T21:50:58+05:30 IST