27న తేలనున్న జగన్ బెయిల్ భవితవ్యం
ABN, First Publish Date - 2021-04-22T19:02:32+05:30
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ ధాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ ధాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్పై 11 చార్జ్షీట్లను సీబీఐ నమోదు చేసిందని పిటీషనర్ వాదనలు వినిపించారు. పిటీషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నారాయణ రావువాదనలు వినిపించారు. పిటీషన్ అర్హతపై కోర్టులో వాదనలు కొనసాగాయి. అయితే పిటీషన్ను విచారించాలా లేదా అన్నదానిపై ఈ నెల 27న సీబీఐ కోర్టు నిర్ణయం తెలుపనుంది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 27కు సీబీఐ న్యాయస్థానం వాయిదా వేసింది.
Updated Date - 2021-04-22T19:02:32+05:30 IST