రుయా ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
ABN, First Publish Date - 2021-05-17T15:51:39+05:30
తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
అమరావతి: తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో చనిపోయిన కోవిడ్ బాధితులకు ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలని పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 ఆక్సిజన్ ప్లాంట్స్ వెంటనే నెలకొల్పాలని, కోవిడ్ బాధితులకు మందులు, ఆక్సిజన్ అవసరమైన ఇతర సదుపాయాలు ఆలస్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించాలని, రుయా ఆసుపత్రి ఘటనపై జ్యూడిషల్ విచారణ జరిపించాలని పిల్లో తెలిపారు. రుయా ఆస్పత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.
Updated Date - 2021-05-17T15:51:39+05:30 IST