AP: నేడు అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ
ABN, First Publish Date - 2021-08-24T13:47:32+05:30
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం ఈరోజు నగదును జమ చేయనుంది.
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం ఈరోజు నగదును జమ చేయనుంది. రూ.10 వేలలోపు డిపాజిటర్లకు దాదాపు రూ.207.61 కోట్లు చెల్లింపులు జరుగనున్నాయి. అలాగే రూ.20 వేలలోపు డిపాజిటర్లకు రూ.459.23 కోట్లు చెల్లించనుంది. 7 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులకు రూ.666.84 కోట్ల నగదును జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది.
2019 నవంబరులో 3.40 లక్షల మంది బాధితులకు రూ.238.73 కోట్ల నగదును సర్కార్ చెల్లించింది. దీంతో ఇప్పటి వరకూ 10.40 లక్షల మంది బాధితులకు రూ.905.57 కోట్ల నగదు చెల్లింపులు జరిగాయి. హైకోర్టు ఆదేశాల మేరకు వాలంటీర్లు, సచివాలయాల ద్వారా బాధితుల్ని గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి చెల్లింపులు జరుపనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Updated Date - 2021-08-24T13:47:32+05:30 IST