పల్టీ కొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ABN, First Publish Date - 2021-05-14T05:42:47+05:30
పల్టీ కొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
వత్సవాయి, మే 13: జాతీయ రహదారిపై మండలంలో భీమవరం సమీపంలో కొంగర మల్లయ్య గట్టువద్ద గురువారం ఉదయం కారు అదుపు తప్పి పల్టీ కొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మానికి చెందిన ముగ్గురు విజయవాడలో కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. అటుగా వస్తున్న చిల్లకల్లు ఎస్సై వి.వెంకటేశ్వరరావు గమనించి కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. తీవ్రగాయాలైన వారిని అంబులెన్స్లో జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి పంపించి, వత్సవాయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సరైన సమయంలో స్పందించి క్షతగాత్రులకు ముప్పు నుంచి తప్పించిన ఎస్సై వెంకటేశ్వరరావును పలువురు అభినందించారు.
Updated Date - 2021-05-14T05:42:47+05:30 IST