424 కేసులు.. నలుగురు మృతి
ABN, First Publish Date - 2021-06-18T05:16:55+05:30
424 కేసులు.. నలుగురు మృతి
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా కారణంగా జిల్లాలో గురువారం మరో నలుగురు మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 424 మందికి వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య అధికారికంగా 1,050కు చేరగా, పాజిటివ్ కేసులు 97,147కు పెరిగాయి. వీరిలో ఇప్పటివరకు 90,811 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 5,286 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2021-06-18T05:16:55+05:30 IST