మరో ముగ్గురు బలి
ABN, First Publish Date - 2021-04-17T05:14:43+05:30
మరో ముగ్గురు బలి
కొత్తగా 246 మందికి వైరస్
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా మహమ్మారికి శుక్రవారం మరో ముగ్గురు బలయ్యారు. కొత్తగా 246 మంది వైరస్ బారినపడ్డారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,173కు చేరింది. మరణాల సంఖ్య అధికారికంగా 699కు పెరిగింది. ఇంకా 3,470 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా బారినపడిన బాధితుల్లో 50,004 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.
Updated Date - 2021-04-17T05:14:43+05:30 IST