12 మందికి కరోనా.. 42 మంది డిశ్చార్జి
ABN, First Publish Date - 2021-01-17T05:17:09+05:30
12 మందికి కరోనా.. 42 మంది డిశ్చార్జి
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో శనివారం 12 మందికి కరోనా సోకింది. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,309కు పెరిగింది. కొత్తగా మరణాలు నమోదు కాలేదు. దీంతో జిల్లాలో అధికారికంగా మరణాల సంఖ్య 676 వద్ద నిలకడగా ఉంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 42 మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంకా 292 మంది చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2021-01-17T05:17:09+05:30 IST